Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
నందివనపర్తిలో ఓంకారేశ్వర దేవాలయ భూములను సాగుచేస్తున్న కౌలు రైతులను తెలంగాణ ప్రభుత్వం అదుకుంటుందని యాచారం జడ్పీటీసీ కె.రమేశ్గౌడ్ , మండల పార్టీ అధ్యక్షులు అచ్చన మల్లికార్జున్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగారం గ్రామంలో రైతులను రెచ్చగోట్టాలని చూడడం సరైందికాదు. ఈసీ శేఖర్గౌడ్ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ క ితెలియకుండా రైతులతో సమావేశం పెట్టి ఎమ్మెల్యేను, ఆయన కుమారుడిపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికార పార్టీలో ఉండి పార్టీపై ఎమ్మెల్యే పై తప్పడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పార్టీ అదిష్టాణానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే భూములు అమ్ముకుంటున్నాడని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు. మండలంలో చిచ్చుపేట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయనతో బాటు వేల్తున్న నాయకులు బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగారం సర్పంచ్ అరుణ పాండురంగారెడ్డి, ఎంపీటీసీ బాగ్యమ్మ, టీఆర్ఎస్ మండల కార్యదర్శి తలారి మల్లేశ్, ఉప సర్పంచ్ వరప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.