Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షుడు బి.దత్తునాయక్
నవతెలంగాణ-మహేశ్వరం
అత్యాచారానికి గురైన రెండేండ్ల చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.దత్తునాయక్ అన్నారు. బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుక్కుగూడలో చిన్నారిపై అత్యాచారం అయ్యి 20 రోజులు కావస్తున్న నిందితునికి సహక రించిన శ్రీప్రేమ టాకీస్ యజమానిని అరెస్టు చేయలేదన్నారు. అదే విధంగా ప్రభుత్వం తరుపున చిన్నారిని ఆదుకోవడానికి సంబంధిత అధికారులతో పాటు సీడీపీఓ షాబానబేగం కూడా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి చిన్నారిని ఆదుకోకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో తుక్కుగూడ హైవేపై పెద్ద ఎత్తున దర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.