Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ - చేవెళ్ల
రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, నవాబ్పేట్ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామంలో నివాసముంటూ పట్టాదారు పాసుపుస్తకాలుండి సేద్యం చేస్తున్న వారినే ఎంపిక చేస్తామన్నారు. అన్ని సామాజిక వర్గాల రైతులు సమితిలో సభ్యులుగా ఉండాలని తెలిపారు. సెప్టెంబర్ ఒకటి నుంచి 9 వరకు అన్ని గ్రామాల్లో పర్యటించి గ్రామ రైతు సమన్వయ సమితిని ఎన్నుకుంటామన్నారు. గ్రామ సమతిలో 15 మంది సభ్యులు, మండల సమితిలో 24 మంది, జిల్లా సమితిలో 24 మంది, రాష్ట్ర సమితిలో 42 మంది సభ్యులు ఉంటారన్నారు. పారదర్శకంగా సభ్యుల ఎంపిక జరగాలని పేర్కొన్నారు. గ్రామంలోని రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ దేవ్కుమార్, ఎంపీపీ బాల్రాజ్, జడ్పీటీసీలు లకీë, రాజేందర్, పోలీస్రాంరెడ్డి, గుడిమల్కా పూర్ మార్కెట్ ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి, చేవెళ్ల సర్ధార్నగర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు విజయలకీë, వెంకటయ్య, చేవెళ్ల వైస్ చైర్మన్ మాసన్నగారి మాణిక్యరెడ్డి, పార్టీ మండలా ధ్యక్షుడు రమేష్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాయకులు రాంరెడ్డి, నాగార్జున్రెడ్డి, యాదగిరి, రవీందర్, పాండుయాదవన, నర్సింలు, మక్బుల్, షరీఫ్, జంగయ్య తదితరులు ఉన్నారు.