Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తలకొండపల్లి
మండలంలోని ఎంపీడీఓ మీటింగ్హాల్లో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం గందరగోళం మధ్య జరిగింది. ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ, తహశీల్దార్ వివిధ గ్రామాల సర్పంచ్లు, అధికారులు హాజరయ్యారు. సమావేశంలో మొదటగా ఏఓ వ్యవసాయశాఖ అధికారి రాజు అతని సందేశాన్ని వినిపించారు. సందేశంపై కోఆప్షన్ సభ్యులు ఖాజాపాషా మాట్లాడుతూ.. సొసైటీ నుంచి ఇచ్చే యూరియాను రైతులకు సమయానికి ఇవ్వాలన్నారు. సరైన సమయంలో ఇవ్వకపోవడంతో రైతులు బయటి మార్కెట్లో రూ.350కి బస్తాను కొనుగోలు చేసి నష్టపోతున్నారన్నారు. సొసైటీ ధర రూ.240 ఉన్నాయని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ.. మండల విద్యా వ్యవస్థలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా విద్యావాలంటీర్లతో కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సంబంధిత అధికారులకు నివేదికలు పంపామని, రెండు పాఠశాలల్లో టాయిలెట్లు లేవని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఎంపీటీసీ రాములు కల్పించుకొని చంద్రన గ్రామ పంచాయతీకి చెందిన నల్లరాళ్లతండాలో 11మంది విద్యార్థులు ఉన్నారని, ఒక్కో రూ.40చొప్పున భోజనానికి కేటాయిస్తున్నారని, కానీ వంట వారికి రోజుకు రూ.44 ఖర్చు వస్తోందని వివరించారు. వారానికి మూడుసార్లు గుడ్లు వడ్డిస్తున్నారు. ఆమెకు నెలకు వచ్చే తక్కువగా ఉండడంతో ఆమె పోషణ ఎలాగని ప్రశ్నించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అలాంటి వారికి వేతనం ఇచ్చేలా కృషి చేయాలని సభ దృష్టికి తెచ్చారు. అనంతరం వైద్యంపై వివరణరాగా మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు ఉన్నా ఏ ఒక్క అధికారి కూడా సమావేశానికి హాజరుకాకపోవడంతో వారిపై తీర్మానం కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని జడ్పీటీసీ నర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ వాటా గురించి వాయిదా పడిన విషయం తెలిసిన విషయమే. వీటిపై ఎంపీటీసీ భగవాన్రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ వాటా తేలాలని ఆయన పట్టుబట్టడంతో ఎంపీడీఓ కల్పించుకుని సీసీరోడ్లు, జనరల్ ఫండ్ విషయం ఎజెండా వచ్చినప్పుడు ఈ విషయం చర్చిద్దామని తెలిపారు. అయినా వినకుండా ఎంపీటీసీ రాంపూర్ వెంకటయ్య సభ వేదిక వద్దకు వెళ్లి వాయిదా వేసినప్పుడు చర్చించని విషయాన్ని ఇప్పుడు ఎందుకు చర్చించరని టేబుల్పై తన చేతితో గట్టిగా బాదారు. ఎంపీటీసీ గోపాల్నా యక్ ఖాజాపాషా కల్పించు కొని ఇంత మంది చెబుతున్నా వినకుం డా వేదికపై గుద్దడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీబాయి మాట్లాడుతూ.. మండలంలోని 59అంగన్వాడీ సెంటర్లలో పనులు సక్రమంగా జరుగుతున్నాయి. కొన్ని తండాల్లో మినీ అంగన్వాడీల నుంచి అంగన్వాడీగా గుర్తించి ప్రభుత్వానికి నివేధి కలు అందించినట్లు ఆమె గుర్తు చేశారు. అలాగే ఏక్సైజ్శాఖ మండలంలో నాటుసారా తయారీదా రులను అరికట్టి ప్రభుత్వం ద్వారా 11కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. విద్యుత్శాఖ, ఇరిగేషన్, సాంఘీక సంక్షేమశాఖ, ఐకేపీ, ఇందిరాక్రాంతిపథం, పంచాయతీరాజ్, మహాత్మాగా ంధీ, ఎన్ఆర్ఈజీఎస్, ఉద్యనవనం అన్నిశాఖల వారు పాల్గొని వారి సమస్యలపైన చర్చించి జరిగిన సమావేశంలో రోడ్డు పనులపై చర్చలు జరిపి తీర్మానం చేయాల్సిందిగా అధ్యక్షులవారిని ఎంపీటీసీలు, సర్పంచ్లు సూచించారు. ఎంపీటీసీ రవి మాట్లా డుతూ వర్షాకాలంలో గ్రామాల్లోని రోడ్లు బురదమ యంగా మారి రవాణా సౌకర్యాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మా సొంత గ్రామమైన పడకల్ గ్రామంలో నాయొక్క ఇంటి ముందు చెరువులా తయారు కావడాన్ని, గ్రామ సర్పంచ్గానీ, ఏఈపీఆర్ఓ కూడా స్పందించ కుండా ఉండడంతో ఈ రోజు ఓ లారీ స్లీప్ అయి బోల్తా పడడం జరిగింది. దాంతో డ్రైవర్ గాయాలపాల య్యాడు. గ్రామ స్తులతో రాస్తారోకో చేయించినా గ్రామ సర్పంచ్, ఏఈపీఆర్ఓ పట్టిం చుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పై విషయాలన్నీ సభ దృష్టికి తీసుకొచ్చిన అనంతరం జడ్పీటీసీ మాట్లాడుతూ మం డలంలో ముఖ్యంగా రైతుల యొక్క సమస్యలు, రోడ్లు సమస్యలు, సీసీరోడ్లకు మంజూరైన నిధులపైన ఆయ న సుధీర్ఘమైన ప్రసం గాన్ని అందించారు. వీటిపైన తీర్మానా లు చేసి తగు నిర్ణయాలు తీసు కోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచి స్తానని, అధికారులకు నివేధిక పంపి స్తానని చెప్పి సభను ముగించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పం చ్లు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.