Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూర్ రూరల్
మండల పరిదిలోని ప్రభుత్వ పాఠశా లలో మధ్యాహ్న కార్మి కులు మండల విద్యా ధికారికి సమ్మె నోటీసు సందజేశారు. ఈ నెల 8,9 తేదీల్లో జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం తాండూర్ మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 45 వ ఇండియన్ లేబర్ కార్ఫ్ సిఫారసులు అమలు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించొద్దని వారు విన్నవించారు. అలాగే గుడ్లకు అదనంగా డబ్బులు కేటాయించాలన్నారు. నెలకు రూ. 3000 పింఛన్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రోసిడింగ్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీస వేతనం రూ. 18 వేలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు, మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. అక్రమ తొలగింపులు ఆపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస్, తాండూర్ మండల మధ్యాహ్న భోజన సంఘం అధ్యక్షురాలు నరసమ్మ, కార్యదర్శి నిర్మల, పార్వతమ్మ పాల్గొన్నారు.