Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ ధృవపత్రాలను జిల్లా ఎన్నికల అధికారి రాములు శనివారం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాలంటీర్లుగా పనిచేసిన కళాశాలకు చెందిన 80మంది విద్యార్థుల సేవలను గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికలలో వాలంటీర్లుగా పాల్గొన్న 80 మంది విద్యార్థుల ప్రతిభను గుర్తించామని, అందులో స్వప్న, గణేష్లకు దృవపత్రాలను అందజేశామని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ధవపత్రంతో పాటు ఒక్కొక్క విద్యార్థికి రూ. 350 చొప్పున అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారి వెంకటయ్య, కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన్, లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు.