Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన బీఎల్ఓలు
నవతెలంగాణ-జిల్లేడ్చౌదరిగూడెం
గత మూడేండ్లుగా తమకు రావాల్సిన వేతనాలను వెంటనే ఇవ్వాలని బీఎల్ఓలు డిమా ండ్ చేశారు. మండల పరిధిలోని బీఎల్ఓలు తహశీల్దార్ రాంబాయికి వినతిపత్రం అంద జేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో సరిపెట్టు కుంటూ ఎన్నికల సమయంలో బీఎల్ఓలుగా అదనపు పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు ఖర్చు చేసి బీఎల్ఓలుగా పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీఎల్ఓలు తిరుమలమ్మ, స్వప్న, భాగ్యమ్మ, పుష్ప, వసంత, అనుసూయ, సవిత, రాణెమ్మలతో పాటు ఆయా గ్రామాల బీఎల్ఓలు పాల్గొన్నారు.