Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కడ్తాల్
మండల కేంద్రానికి చెందిన జల్కం మల్లయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తన అనుచరులతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం స్థానిక టీఆర్ఎస్ నాయకుడు గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ గంప వెంకటేష్ గుప్త సమకూర్చిన రూ.5,100లను ఎమ్మెల్యే మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జర్పుల దశరథ్నాయక్, టీఆర్ఎస్ నాయకులు జీఎల్ఎన్.రెడ్డి, గంప శ్రీను, జహాంగీర్అలి, తదితరులు పాల్గొన్నారు.