Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూర్ రూరల్
స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్డీఓ వేణుమాధవరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. స్టేజ్ 1 స్టేజ్ 2 అధికారులకు శనివారం కొడంగల్ , తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాలకు చెందిన అధికారులకు అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల నియమ నిబంధనలపై ఉపాధ్యాయులకు సూచించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు తెలుపవలసిన నియమ నిబంధనలను శిక్షణలో వివరించారు. మొదటి విడత ప్రారంభం తాండూరు నియోజకవర్గానికి ఈనెల 7 నుండి 9 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నేషనల్ వేసే ప్రతి అభ్యర్థికి సూచనలు సలహాలు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు అధికారులు పాల్గొన్నారు.