Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
- మెకానిక్ అసోసియేషన్ సభ్యులు
నవతెలంగాణ-తాండూరు
పట్టణ కేంద్రంలోని మెకానిక్ల సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం మండల మోటర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ..రానున్న రోజుల్లో మోకానిక్ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీనిచ్చారు. గతంలో కొందరూ నాయకులు పబ్బం గడుపుకునేందుకు స్థాలాలు కూడా చేటాయించకుండా ఉత్తిమాటలతో నమ్మించి మోసం చేశారన్నారు. ప్రస్తుతం మాటలతో కాకుండా చేతలు చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సునీతాసంపత్, కాంగ్రెస్ నాయకులు మురళీకృష్ణగౌడ్, నయామ్ అప్పూ, ప్రభాకర్గౌడ్, అసోసియేషన్ నాయకులు సుధాకర్, మక్సూద్, షఫి, ఆయూబ్, ఖలేద్, సాయబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.