Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాతావరణ డిజిటల్ (వెదర్) డిస్ప్లే బోర్డును జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ శనివారం ఆవిష్కరించారు. రోజువారీగా వాతావరణ వివరాలు డిజిటల్ బోర్డులో ప్రదర్శించడం జరుగుతుందని చెప్పారు. దీని వల్ల ప్రజలకు వాతావరణ వివరాలు తెలుస్తాయని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 58 ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల నుండి వచ్చే వాతావరణం, వర్షపాతం వివరాలు ఈ డిస్ప్టే బోర్డులో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. డిస్ప్లే బోర్డుల ద్వారా వాతావరణం, వర్షపాతం వివరాలను తెలియజేస్తూ ప్రజలను, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ డీపీఎస్్ సీఈవో షేక్మీరా. సీపీఓ ఓంప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.