Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్న అధికారులు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-ఆమనగల్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చేరువలో ఉన్న ఆమనగల్, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల పరిధిలోని పలు ప్రభుత్వ శాఖల అధికారుల పని తీరు అధ్వానంగా మారింది. కొందరు అధికారులు, సిబ్బంది సైతం హైదరాబాద్లో నివాసముంటూ మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో పాటు సమయపాలన పాటించని అధికారుల మూలంగా వివిధ కార్యాలయాలకు పనుల నిమిత్తం వస్తున్న గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిందిస్థాయి అధికారుల తీరుపై సంబంధిత ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు ప్రజా ప్రతినిధుల పట్టింపులేని వైఖరితో ఆయా మండలాల్లో విధులు నిర్వహిస్తు అధికా రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
విధులకు హాజరవుతూ ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతు న్నారు. పూర్వపు సమితి ఆమనగల్ పరిధిలోని మండలా ల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిలో తొంభైశాతం మంది రాజధానిలోనే నివాసం ఉంటూ నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్రధాన శాఖల కొందరు అధికారులు, సిబ్బంది ఉదయం 11 గంటల వరకు కార్యాలయాలకు చేరుకోకపోగా, మధ్యాన్నం 3 గంటలకు విధులను పక్కన పెట్టి నిష్క్రమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా కొందరు అధికారులకు నివాస గృహాలున్నా వారు అందులో నివాసముండడం లేదు. అదేవిధంగా గ్రామ కార్యదర్శులు వీఆర్వోలు కూడా చాలామంది స్థానికంగా నివాసం ఉండక చుట్టపు చూపు లా వచ్చి పోతుండడంతో వారికోసం నెలల తరబడి ఎదు రుచూడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పునర్ విభజనలో భాగంగా ఈ నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలిసినా మండల అధికా రుల్లో మార్పు రాకపోవడం విశేషం. ఆయా మండలాల్లో అధికారులు ఇష్టారీతిగా విధులు నిర్వహిస్తున్నా స్పందిం చని ఉన్నతాధికారుల తీరు విమర్శలకు తావిస్తుంది.
ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి, ప్రజాప్ర తినిధులు చొరవచూపి స్థానికంగా ఉండని, సమయపా లన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. -
-