Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దేముల్
ప్రభుత్వం కుల వర్గ పేరుతో విద్యారంగాన్ని విడదీసిందని, ప్రభుత్వ పాఠశాలల కృషికి దాతలు సహకారం అందించాలని పెద్దేముల్ జెడ్పీటీసీ ధారా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మండల, జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ధారా సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ పట్టణ ప్రాంతంలోని బడుగు బలహీన విద్యార్థులకు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యాబోధన చేయడం వల్ల చిన్న వయసులోనే కులంపైన మమకారం ఎక్కువ అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతలోని పాఠశాలలను దాతల సహకారం తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ అనురాధ మాట్లాడుతూ... సమాజంలో ఉపాధ్యాయుల వృత్తి పవిత్రమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మధులత, ఎంపీటీసీ న్యాయవాది అంబరయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజిత, ఇన్చార్జి ఎంఈఓ వెంకటయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, అక్క మా దేవి, మల్లమ్మ, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వివిధ శాఖల సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.