Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
మండలంలోని సంగయ్య పల్లి, చిట్లపల్లి, అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసంలో భాగంగా సామూహిక సీమంతాలు, అన్న ప్రాశం, పోషణ ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ జైరామ్ నాయక్ మాట్లాడుతూ..గర్భిణులు, బాలింతలు పోషక విలువలు గల ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ కాంతారావు, ఎంపీటీసీ శివప్ప, ఉప సర్పంచ్ కిష్టమ్మ, సూపర్వైజర్ పార్వతి దేవి, పోషణ అభియాన్ యాదగిరి, శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, ప్రజలు పాల్గొన్నారు.
తాండూర్ రూరల్ : మండలంలోని రాంపూర్ అంగన్వాడి కేంద్రంలో గురువారం గర్భణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. అలాగే ఆరు నెలలు దాటిన పిల్లలకు అన్న ప్రసన్నం చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం జ్యోతి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పుట్టబోయే పిల్లలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు సెంటర్లలో ఆహారం ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గర్భిణులు పాల్గొన్నారు.