Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
ప్లాస్టిక్ పెను భూతాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర చైర్మెన్ శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం షాద్నగర్లోని బీఏఎం డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ నివారణపై అవగాహనా కార్యక్రమం, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మానవుడు నిత్యజీవితంలో అత్యధికంగా ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారని దీనిద్వారా భూగర్భంలో ప్లాస్టిక్ ఒక వ్యర్థంగా తయారు కావడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. భూమి, నీరు ప్లాస్టిక్ వ్యర్థంతో అనేక రోగాలకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి కూడా ఆటంకంగా తయారైందన్నారు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకు ఎక్కువ అవుతున్నట్టు జీరో మైగ్రాన్ ప్లాస్టిక్ వాడటం ఎంతో ప్రమాదకరమని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ కర్తవ్యంగా బాధ్యతాయుతంగా నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం సాంకేతిక అభివృద్ధిలో కూడా ఆటంకంగా తయారవుతుందని దీనిని నివారించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటయ్య గౌడ్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ, హన్మంత్, లెక్చరర్ గోపాల్, శ్రీను, నర్సింహులు, విద్యార్థులు పాల్గొన్నారు.