Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
క్రీడలంటే క్రికెట్ ఒక్కటే కాదని అన్ని క్రీడల్లో రాణించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం వికారా బాద్ మున్సిపాలిటీలోని ఎంఐజీ కాలనీలో ఉన్న శిశుమందిర్ స్కూల్ గ్రౌండ్స్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలీబాల్ టోర్న మెంట్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నా రు. హాకీ జాతీయ క్రీడ అనే విషయాన్ని మర్చి పోవద్దని, క్రికెట్ తో పాటు మిగతా ఆటలు కూడా ఆడేలా భావి తరాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు కృష్ణారెడ్డిని, ఇతరులను అభినందించారు.
ఈ కార్యక్రమ ంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, పీఏసీఎస్ చైర్మెన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, అనంత్రెడ్డి, గోపాల్, గాయత్రి లక్ష్మణ్, నర్సింహులు, చందర్ నాయక్, నాయకులు చిగుల్లపల్లి రమేష్, విజయకుమార్, మల్లేష్, సుబాన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.