Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం లాంటిదని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్యాదవ్ అన్నారు. కడ్తాల్ మండ లంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన పి.నరేం దర్, మోహన్రెడ్డిలకు వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.60,000లు, రూ.17,500ల చెక్కులను ఎమ్మెల్యే శనివారం హైదరాబాద్ లోని తన స్వగృహంలో లబ్దిదారులకు అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యసేవలు లభిం చని వైద్యం కోసం వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకొ ని సాయం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమ ంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్, పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ జోగు వీరయ్య, సర్పంచ్ బాగ్యమ్మ జంగయ్య, కల్వకుర్తి వైస్ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు గంప శ్రీను, దర్శన్రెడ్డి, విజరుగౌడ్, బాలయ్య, శ్రీను, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.