Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిల్లేడ్ చౌదరిగూడెం
మండల కేంద్రంలో పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ప్రమాదాలకు నెలవుగా మారాయి. చౌదరిగూడెం మండల కేంద్రంలో ఇటీవల వీధి లైట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్, ఇదివరకే ఏర్పాటు చేసిన వీధి లైట్ల స్తంభాల మధ్యలో నుంచి వేయడం అధికారుల అవగాహనా తీరుకు అద్దం పడుతున్నదని పలువురు చర్చించుకుంటున్నారు. నిత్యం జన సంచారం ఉండే ప్రదేశంలో ఇలాంటి ప్రమాద పరిస్థితులు ఉండటం ఏమిటని మండల వాసులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక అనేక చోట్ల రోడ్లకు పక్కన ప్రమాద భరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. దీంతో ఎపుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అదే కాకండా మండల పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నా యి. దీంతో ఆయా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికార యంత్రాంగం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ప్రయాణించాలంటే భయంగా ఉంది
రోజు మండల కేంద్రానికి అనేక పనుల నిమిత్తం వస్తుంటాం, సరిగా గుర్రంపల్లి దగ్గర మూల మలుపులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రమాదంగా ఉంది.ఏమాత్రం ఏమరుపాటు లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను ఢకొీట్టే అవకాశం ఉంది.రోడ్ పై వెళ్లాలంటే భయంగా ఉంది.
శ్రీను, ద్విచక్రవాహనదారుడు, ఎదిర
ఉన్నతాధికారులు స్పందించాలి
రోడ్లకు అనుకుని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను వెంటనే తొలగిం చాలి. అధికారులు ప్రమాదాలు జరిగే వరకు ఆలస్యం చేయకూడదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి.
రాజు, రావిర్యాల
ఎలాంటి ఆదేశాలు లేవు..
రోడ్ల పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫా ర్మర్లు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను మరమ్మతులు చేయడానికి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామా ల్లో విధి లైట్ల కోసం ప్రత్యేకంగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశాం. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటాం.
వినరు కుమార్ రెడ్డి, విద్యుత్ ఏఈ