Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహేశ్వరం
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాడిగల్ల భాస్కర్ తల్లి కాడిగల్ల జంగమ్మ( 80) మంగళవారం మృతిచెందారు. ఆమె స్వగ్రామం కొల్లపడకల్ గ్రామంలో మరణించారు. ఆమె మృతదేహానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న కాడిగల్ల భాస్కర్కు ఎల్లవేళలా తోడ్పాటునందిస్తూ ఉద్యమానికి సహకరించిన ఆమె గొప్పతనాన్ని కీర్తించారు. ఆమె లేని లోటు తీరనిది అన్నారు. చిన్ననాటి నుంచి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న భాస్కర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాన్వెస్లీ, బి. వెంకట్, టి. సాగర్, భూపాల్, స్కైలాబ్ బాబు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రామ్ చందర్, సామెల్, జిల్లా కమిటీ సభ్యులు శోభన్, జగన్, సిహెచ్ జంగయ్య, జగదీష్, మండల కార్యదర్శి అల్వాల రవికుమార్, శేఖర్ బాలయ్య, కిషన్, తదితరులు పాల్గొన్నారు.