Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షాబాద్ ఎంపీడీవో రామకృష్ణ్ణ
నవతెలంగాణ-షాబాద్
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలల్లో పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరి చేరవనీ ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని ముద్యంగూడా సంకేపల్లిగూడ గ్రామాల్లో పర్యటించి గ్రామ పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రస్తుతం వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వైరస్ను అరికట్టాలంటే గ్రామంలో పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. ఎప్పటికప్పుడూ మురుగు నీటి కుంటలు, చెత్తాచెదారం, ముండ్ల చెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ గ్రామ కార్యదర్శులను ఆదేశించారు.కరోనా వ్యాధిని నిర్మూలించేందుకు భౌతికదూరం, మాస్కలు ధరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి దర్శన్, ఉప సర్పంచ్ రాజేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వార్డు సభ్యులు తదితరులున్నారు.