Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
ఐకేపీల ద్వారా దుకాణాదారులు తీసుకున్న అసెస్ట్ లోన్ రుణాలు సకాలంలో చెల్లించాలని గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారి కృష్ణన్ తెలిపారు.మంగళవారం దోమ మండల కేంద్రంలో పలు దుకాణ సముదాయాలకు వెళ్లి వెరిఫికేషన్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీల ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. గ్రామంలో ఎంత ఐకేపీ ద్వారా లోన్లు తీసుకున్నారో ఆ సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్టు వివరించారు. దుకాణ దారులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ వినియోగదారులకు భౌతిక దూరం పాటిస్తూ, విక్రయించుకోవాలని సూచించారు. అనంతరం పల్లె సమగ్ర కేంద్రం వెళ్లి బ్యాంక్ వినియోగదారులకు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించి, మాస్కు లు ధరించి, చేతులకు శానిటైజర్లు రుద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది జంగయ్య, భాగ్యలక్ష్మి, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.