నవ తెలంగాణ-మంథని: మంథని సీఐగా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన గట్ల మహేందర్ రెడ్డిని మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మంథని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తగరం శంకర్ లాల్, మంథని మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆకుల కిరణ్, డైరెక్టర్ గోబ్బూరి వంశీ లు మాట్లాడి ఘనంగా సత్కరించారు.
Mon Jan 19, 2015 06:51 pm