నవ తెలంగాణ-మంథని:
మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికి చెందిన చిప్ప సతీష్( 32)అనే యువకుడు కరోనాతో మంగళవారం మృతి చెందారు. స్థానికుల,కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం చిప్ప సతీష్ సోమవారం ఉదయం ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంగళవారం మధ్యాహ్నం తన శరీరంలో ఏమో అవుతుందని కుటుంబ సభ్యులకు తెలపడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేయగా మంథని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సతీష్ మృతి చెందాడని తెలిపారు. మృతదేహాన్ని మంథని గోదావరి స్మశాన వాటికకు తరలించి కుటుంబ సభ్యులు దాహన సంస్కారాలు నిర్వహించి ఖననం చేశారు. మృతుడు సతీష్ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేసే వాడిని, గ్రామస్తులకు, అటు అధికారులకు, సన్నిహితంగా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉండే వాడని సతీష్ మృతి చెందడనే వార్తతో తెలియడంతో పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కరోనా రెండో దశలో తొలి మృతి గా సతీష్ మృతిచెందాడని వార్త దావానంలా వ్యాపించడంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. సతీష్ మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సూరయ్యపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముగ్గురికి కరోనా పాజిటివ్...
మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం తొమ్మిది మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ గా రిపోర్టులో నమోదయింది. దీనిలో భాగంగా మంథనిలో ఇద్దరికీ, వెంకటాపూర్ లో మరొకరికి, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యధికారులు పేర్కొన్నారు.మంథని మండలంలో రోజు రోజుకు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో మండలంలోని ప్రజలు, వ్యాపార వర్గాలు పలు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 07:59PM