- ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల కన్వీనర్ పుట్ట నవీన్
నవతెలంగాణ ధర్మసాగర్
విద్యా వాలంటీర్ ల సమస్యలు పరిష్కరించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల కన్వీనర్ పుట్ట నవీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల ఈ సమావేశంలో వారు మాట్లాడారు. కరుణ సంక్షోభ కాలం నుండి విద్యా వాలంటీర్లు సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈరోజు నల్గొండలో విద్యా వాలంటీర్ పాలకూరి శైలజ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలా మొన్న కొమరం భీం జిల్లాలో బర్కుటే బండూ, నిన్న ఆదిలాబాద్ జిల్లాలో తోడసం రామస్వామి, నేడు శైలజ ఇలా విద్యావాలంటీర్ల ఆత్మహత్యలు నిలువరించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని తెలిపారు. కరోనా మూలంగా ఒక సం. నుండి రెన్యువల్ చేయకపోవడంతో 13నెలలుగా ఎలాంటి ఉపాధి లేకపోవడం వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిస్థితులు ఇకముందు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యావాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 12వేల కుటుంబాలు రోడ్డున పడి పస్తులుంటున్నారని, ప్రభుత్వం వారిచే మెరిట్ ప్రకారం నియమించబడి ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని సంవత్సరాలుగా పని చేసి తరుణ సంక్షోభంలో ఆర్థిక సమస్యలకు లోనై పలువురు మరణించగా తాజాగా ఆర్థిక ఇబ్బందులతో నల్గొండలో విద్యా వాలంటీర్ శైలజ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టక ప్రభుత్వ అవసరానికి పని చేయించుకొని రోడ్డున పడేసిన తెలంగాణ ప్రభుత్వ ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే ఇలాంటి మరొక మరణం సంభవిచక ముందే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విద్యా వాలంటీర్లు పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.
ప్రయివేట్ ఉపాధ్యాయులతో పాటు విద్య వాలెంటర్లను ఆదుకుంటే ఈ రోజు ఈ మరణం సంభవించేది కాదని. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకొని ఇప్పటికైనా విద్యా వాలంటీర్లనూ ఆదుకోవాలని తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘంల తరపున ఎమ్మార్పీఎస్ టీఎస్ పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు లేనిపక్షంలో రానున్న రోజులలో ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 08:05PM