- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ కంటేశ్వర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు ఈ దేశానికి ఆదర్శం అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల మోహన్ రెడ్డి అన్నారు ఈ మేరకు బుధవారము జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి ,అర్బన్ ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి,పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర మరువలేనిదని, బహుజనులకు బలహీనవర్గాలకు ఈ సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని,కాని కొంతమంది మూర్ఖులు దేశం కోసం సర్వశక్తులు ఒడ్డిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నారని, కానీ అంబేద్కర్ అన్ని వర్గాలకు చెందిన వాడని ఈ సందర్భంగా అంబేద్కర్ అందరివాడని మానాల మోహన్ రెడ్డి గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు దిశా దశ నిర్ధారించిన వ్యక్తి అని ఆయన ఆలోచనా విధానాలు ఈ దేశానికి ఆదర్శం అని, కానీ ఇది విస్మరించి కొన్ని పార్టీలు ఓట్ల కొరకు మాత్రమే అంబేద్కర్ గారిని వాడుకొని మిగతా సమయంలో అంబేద్కర్ పేరుని ఉచ్చరించడానికి కూడా సిద్ధంగా లేరని అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మానాల మోహన్ రెడ్డి సూచిస్తూ అంబేద్కర్ ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆచరించినప్పుడే ఈ దేశ సార్వభౌమత్వం నిలకడగా ఉంటుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా రూరల్ ఇంచార్జ్ భూపతి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్-3 ప్రకారమే మనం తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందని రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ప్రజలకు వివిధ హక్కులు కల్పించడం జరిగిందని ఆకులలో ప్రధానమైనది వాక్కు స్వాతంత్రపు హక్కు అని ఆయన అన్నారు. కానీ ఇప్పుడున్న పాలకులు ప్రజలు వారికి ఎదురుగా మాట్లాడిన ప్రశ్నించినా వారిపై కేసులు పెడదామని బెదిరించడం జరుగుతుందని, ఇకనైనా వారి తీరు మార్చుకోవాలని భూపతి రెడ్డి రెడ్డి అన్నారు. అనంతరం అర్బన్ ఇన్చార్జి తాహెర్బిన్ హందాన్ మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బిజెపి గాని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని, ఈ దేశంలో ఎవరైనా రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడితే వారిని టీవీలా ద్వారాగాని కేంద్రంలో వారి గుప్పిట్లో ఉన్న అధికారుల ద్వారా గాని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రామకృష్ణ, ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్ నగరం ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబాష్ జాదవ్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజు గగన్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రమోద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:03PM