నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
అంబేద్కర్ అందరివాడు.... డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కొటగల్లి ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ అంబేద్కర్ చదువుతోనే విజ్ఞానం పోటీదారు అని అన్నారు. మహిళల హక్కుల కోసం, కార్మిక హక్కులు చట్టాల కోసం, మొట్టమొదట బొంబాయిలో అంబేద్కర్ పోరాడుతున్న సందర్భంలో కులాల ప్రాతిపదికన చూడలేదని అన్నారు. అణిచివేతకు గురవుతున్న వారికి ఆయన అండగా నిలబడ్డారు అని అన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, చదువుకోన్న సందర్భలలో చదువు పట్ల వివక్షత చూపితే దానికి వ్యతరేకంగా పోరాడి సమాజానికి కావాల్సింది చదివే అని చాటి చెప్పినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు ఎల్.బి.రవి, శివ కుమార్, భూమన్న, రాజన్న, రాజేశ్వర్, సాయి, ప్రేమ్, మనోజ్, ప్రవీణ్, సాదన తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:22PM