- అంబేద్కర్ జయంతి సందర్భంగా
నవతెలంగాణ హైదరాబాద్
అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం కార్మికులకు సన్మాన కార్యక్రమం ఈ.సీ నగర్ లోని కృపా విజ్ఞాన్ సైంటిఫిక్ స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శరత్ సుదర్శి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ప్రేరణ ఫౌండేషన్ ఘనంగా జరుపుతుందన్నారు. భారత రాజ్యాంగ పితామహుడు, ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ జయంతి నాడు పారిశుద్ధ్య కార్మికులు ప్రజల కోసం చేస్తున్న సేవలకు గుర్తుగా చిరుసత్కారం చేశామన్నారు. ఈ.సీ నగర్, చర్లపల్లి, బీ.ఎన్.రెడ్డి నగర్, భరత్ నగర్కు చెందిన 50 మంది కార్మికులకు ఓ టవల్ తో పాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఒక్కొక్కరికీ పది కోడిగుడ్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కృపా సుదర్శి, టాన్యా సుదర్శి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:30PM