నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ప్రగతిశీల విద్యార్థి ఉద్యమనిర్మాత కామ్రేడ్ జార్జిరెడ్డి 49వ వర్ధంతి సందర్భంగా పీ.డీ.ఎస్.యూ, ఐ.ఎఫ్.టీ.యూ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్.ఆర్. భవన్, కోటగల్లీలో పూలమాలతో విప్లవనివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారు అని అన్నారు. మతోన్మాదం, దోపిడీ, పీడనలు లేని సమసమాజాన్ని కాంక్షించారు అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాద గుండాలకు జార్జిరెడ్డి సింహస్వప్నం అయ్యాడు అని అన్నారు. జార్జిరెడ్డిని చంపితే ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం కనుమరుగవుతుందని ఆర్.ఎస్.ఎస్ అనుబంధ గూండాలు జార్జిరెడ్డిని దొంగచాటుగా దాడిచేసి హత్య చేశారు అని అన్నారు. జార్జిరెడ్డి చనిపోయిన నెటికి జీవిస్తునే ఉన్న వీరుడు అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బలమైన విప్లవ విద్యార్థి సంఘంగా పని చేస్తూ పీ.డీ.ఎస్.యూ నిరూపించిందన్నారు. నేడు ప్రభుత్వాలు ఫాసిష్ఠు విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. ప్రభుత్వాల ఫాసిష్ఠు, మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అదే జార్జిరెడ్డికి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్, పౌరహక్కుల సంఘం జిల్లా నాయకులు భాస్కర స్వామి, పీ.డీ.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ప్రశాంత్, జిల్లా నాయకులు అశుర్, సాయితేజ, రమేష్ చారి, విజయ్, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:34PM