- ఎంపీటీసీ ఎస్ కే సంధాని, సర్పంచులు సీతరాములు, ముత్యమాచారి
నవతెలంగాణ-గుండాల
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు, గుండాల సర్పంచ్ కోరం సీతరాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మామకన్ను సర్పంచ్ కొడెం ముత్యమాచారి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని వర్గాల కోసం పనిచేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజల ఆశా జ్యోతి అంబేద్కరుడు అని చెప్పారు.చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపిన ప్రపంచ మేధావి, మహోన్నతుడు, గొప్ప ప్రతిభావంతుడు త్యాగశీలి, భారత రత్న డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకులు పర్శిక రవి, న్యూడెమోక్రసీ నాయకులు వై వెంకన్న, తుడుందెబ్బ నాయకులు వాగబొయిన చంద్రయ్య, ఏజన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు బొమ్మెర సత్యం, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:41PM