నవతెలంగాణ గోవిందరావుపేట
పండిత్ దీనదయాల్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట మండల ప్రధాన కార్యదర్శి మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ జన్మదినం సందర్భంగా మండలంలోని పసర రాంపూర్ తదితర బూతుల లో మొక్కలు నాటామన్నారు. పండిత్ దీన్ దయాల్ ఆశయసాధనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన అన్నారు. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన జన్మదిన కానుక అని అన్నారు. ఇప్పుడు నాటిన మొక్కలు రేపు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి అన్న నమ్మకంతోనే ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండిట్ దీన్ దయాల్ జన్మదిన కానుకగా చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి , సీనియర్ నాయకులు కొత్త సుధాకర్ రెడ్డి , పి బాబు రావు, ఏ రమేష్, మార్కండేయ, ఏ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:03PM