నవతెలంగాణ-మంథని
దేశానికి ఆదర్శమైన అంత్యోదయ పథకం ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు బియ్యం అందించిన మహా గొప్ప వ్యక్తి బీజేపీ వ్యవస్థాపకులు దీన్ దయాల్ అని బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. శనివారం దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మంథనిలోని అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వేల్పుల రాజు, టౌన్ అధ్యక్షులు సదాశివ్, మండల ప్రధాన కార్యదర్శులు తోట మధుకర్, వీరబోయిన రాజేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి, బిజెపి సీనియర్ నాయకులు బోగొజు శ్రీనివాస్, పాగే రంజిత్, వేల్పుల సత్యం, క్రాంతికుమార్, రేపాక శంకర్, సతీష్ ,సంతోష్, సూర్య ,అరుణ్ ,హర్ష వర్ధన్, పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:05PM