జిల్లా జడ్డి గోవర్ధన్ రెడ్డి
నవతెలంగాణ కంటేశ్వర్
కరోనా మహమ్మారితో మనకు జీవితం విలువ తెలిసి ఆరోగ్యంగా జీవించే కళను నేర్చుకుంటున్నారని ఉమ్మడి జిల్లా జిడ్డి ప్రధాన న్యాయమూర్తి, జల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్.గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆరోగ్య క్రమశిక్షణను అలవర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ నిత్య జీవనాన్ని కొన సాగించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవా సంస్థ, జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా కమిటీ సంయుక్త అద్యర్యంలో జిల్లా కోర్టు ఆవరణలోని బ్యాయసేవా సదన్ లో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. కరోనా రెండో వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే ప్రజలు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు తమ విలువైన జీవితాలను ఫణంగా పెట్టి వైద్యసేవలు అందించారని ప్రశంసించారు. కరోనా ప్రాణాంత వ్యాధి కాదని భయం వలన అభద్రతకు గురి కావడం మూలంగా వ్యాధి తీవ్రత పెరిగి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వివరించారు. అంతర్జాతీయ చెవిటి దినోత్సవం సందర్భంగా చెవి, మూగ బాధితులను వారికి ఆరోగ్య పరికరాలను అందజేయడం మషభాగ్యంగా భావిస్తున్నామని అయన అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకనే విషయంలో ప్రతీ వ్యక్తి ప్రత్యక శ్రద్ద వహించాలని, ఆరోగ్య క్రమశిక్షణ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని తెలిపారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే ఏ వ్యాధినైనా జయించవచ్చని, మనోస్థైర్యమే మహాబలంగా పని చేస్తుందని జిల్లా జడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి పర్యవేక్షకురాలు ప్రతిమారాజ్ మాట్లాడుతూ అందరూ తమ తమ ఆరోగ్యాలను రక్షించుకో వాలని, తోడుగా వైద్య సిబ్బంది. వైద్యులు నిలబడతారని అన్నారు. ప్రభుత్వ దవాఖనలో క్రయోమిషన్ ను ఏర్పాటు చేశామని, క్యాన్సర్ కు ముందు వచ్చే అనారోగ్య సమస్యలను గుర్తించి ముందస్తుగా వైద్య చికిత్స అంద చేస్తున్నామని ఆమె తెలిపారు. మన కుటుంబం, మన ఆరోగ్య రక్షణ నినాదమే ప్రేరణగా జిల్లా వైద్య శాఖ ఆరోగ్యవంతమైన సమాజం కోసం శ్రమిస్తోందని ఆమె తెలిపారు. వైద్యులు జీవన్ రావు, విశాల్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా న్యాయసేవా సంస్థతో కలిసి నడుస్తామ ని జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇతర భాగస్వామ్య సంస్థల కలుపుకుని వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి షాకిల్ జషన్ సిద్దికి, సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి విక్రమ్, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, చందన, సౌందర్య, గిరిజ, వైద్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:28PM