సొసైటీ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న
నవతెలంగాణ నవీపేట్
భవిష్యత్తులో రైతుల అవసరాల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయమే పరిష్కారం అవుతుందని నవీపేట్ సొసైటీ చైర్మెన్ అబ్బన్న అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని నవీపేట్, నాగేపూర్, యంచ, నాళేశ్వర్, జన్నెపల్లి గ్రామాలలో రైతులకు వరికి ప్రత్యామ్నాయ పంటలపై శనివారం అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో వరి సాగు పెరగడంతో నిలువ పెరిగి విలువ తగ్గిపోతుందని అన్నారు. మిగతా పంటల సాగు లేక దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతుల అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయమే పరిష్కారమని అన్నారు. అనంతరం రైతులు గంగాధర్, గోపాల్ మాట్లాడుతూ మెట్ట పంటల విత్తనాలను సబ్సిడీపై అందించి ముందే మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అలాగే జిల్లాలోని రెండు చెరుకు పరిశ్రమలను పునర్ ప్రారంభించాలని కోరారు .ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి నాయకులు మాణికేశ్వరరావు, వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు, సర్పంచ్ మల్లేష్, ఏ ఇ ఓ లు సునంద, వినోద్, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:37PM