నవతెలంగాణ-ధర్మసాగర్
వ్యాక్సినేషన్ ను 100 శాతం పూర్తి చేసుకొని రాష్ట్ర స్థాయిలో 2 వ గ్రామంగా నిలిచిన సోమ దేవరపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కమ్యూనిటీ హెల్త్ అధికారి భానోత్ నెహ్రూ చందు నాయక్ అన్నారు. శనివారం మండలంలోని సోమ దేవరపల్లి గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదర్శ గ్రామంగా నిలిచారని వారు మాట్లాడారు. ఈ నేపథ్యంలో గ్రామంలో బ్యానర్ ప్రదర్శన నిర్వహించారు. మాట్లాడారు
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తోట మంజుల కిష్టయ్య మాట్లాడుతూ గ్రామంలో కరోనా నివారణ కోసం ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేసి గ్రామంలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ 100 శాతం వ్యాక్సిన్ చేయించడానికి ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేసిన వైద్య ఉద్యోగులందరికీ,ప్రత్యేకించి ఏఎన్ఎం విజయ కుఅంగన్వాడి ఆశ కార్యకర్తలకు ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామాలలో 100 శాతం వ్యాక్సినేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 07:07PM