నవతెలంగాణ కంటేశ్వర్
చాకలి ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లో గల ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ నేటి సమాజానికి ఆదర్శమన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణా సమాజం ముందుకు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గోపాలకృష్ణ, బిసి ఉపాధ్యాయ సంఘం కోశాధికారి రాజు, శంకర్, శేఖర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:17PM