నవతెలంగాణ-గోవిందరావుపేటను
నవంబర్ 27 దేశ వ్యాప్త బందులో జయప్రదం చేయాలని ఆదివారం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ఏడాది కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రైతుల నల్ల చట్టాలనుచ నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.,రైతుల చట్టాల వలన రైతులు చాలా నష్టపోయే ప్రమాదముందని, కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ ప్రతి ఒక్కరు భారత్ బందును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కావున ప్రతీ ఒక్కరు భారత్ బంద్ ను స్వచ్ఛందంగా జయప్రదం చేయాలని కోరారు. రైతులు,కార్మికులు, ఉద్యోగులు,విద్యార్థులు, వ్యాపారులు, యువకులు ఈ బందుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు చిట్టిబాబు,అధిరెడ్డి,నాగరాజు,రాజేష్,మురళి, ఆగిరెడ్డి,శ్రీను,రామస్వామి, కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రస పుత్ర,సీతారాం నాయక్, దాసరి సుధాకర్, జంపాల ప్రభాకర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి కాడబోయిన రవి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, సర్పంచులు లావుడియా లక్ష్మీ- జోగా నాయక్, భూక్య సుక్య, ముద్దబోయిన రాము, ఉపసర్పంచులు బద్దం లింగారెడ్డి, కట్ల జనార్దన్ రెడ్డి, గ్రామ కమిటి అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, బొల్లు కుమార్, కొల్లు శ్రీనివాస్ రెడ్డి, నన్నెబొయిన సోమయ్య, మందడి ఉత్తరయ్య, టీడీపీ నాయకులు సూరవరపు వెంకట రామయ్య, జంపాల సత్యనారాయణ, నర్రా శివాజీ, ఈర్ల పాపులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:25PM