నవతెలంగాణ డిచ్ పల్లి
నిశిత కాలేజ్ కు ఉన్న అటానమస్ ,న్యాక్ హోదా లను వేంటనే రద్దు చేయాలని, యూజీసీ ,న్యాక్ హెడ్ ఆఫీస్ లకు వేరు వేరుగా ఫిర్యాదు లేఖలను యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ లో పిడిఎస్ యూ ఆధ్వర్యంలో శనివారం పంపించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిశిత డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు రిపోర్టులతో అటానమస్, న్యాక్ పొందారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ అధికారులు నిశిత డిగ్రీ కళాశాలను, పీజీ కోర్సుల కళాశాలను, అదేవిధంగా ఎంబీఏ కళాశాలల భవనాలను తనిఖీలు చేసినప్పుడు యూనివర్సిటీ నియమ, నిబంధనలు లేవని యూనివర్సిటీ అధికారుల తనిఖీలో గదులు, ల్యాబ్, ప్రయోగ శాలలు, పార్కింగ్, మూత్ర శాలలు ఏమాత్రం లేవని, ఎలాంటి నిబంధనలు పాటంచడం లేదని తేలిందన్నారు. ఇవి లేకుండానే కళాశాల గుర్తింపు పొందడం అవివేక మన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ అని, విశాలమైనటువంటి భూమి, తరగతి గదులు ప్రయోగశాలలు, ఉన్న ఈ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్, అటానమస్ గుర్తింపు ఇవ్వకుండా ప్రయివేటు విద్యా సంస్థ లకు నియమ నిబంధనలు లేకపోయినా వాటికి గుర్తింపు ఇచ్చి ప్రజాధనాన్ని ప్రభుత్వం ప్రయివేటు విద్య సంస్థకు అప్పనంగా కట్టబెట్టడం సరైంది కాదని రాజేశ్వర్ మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించి వసతులు లేవని నిర్ధారించిందని పత్రికలకు కూడా తెలిపినట్లు.. దానికి సంబంధించిన వార్తలు కుడా రావడం జరిగిందని పేర్కొన్నారు. యుజిసి రూల్స్ ప్రకారం లేని నిశిత విద్య సంస్థ న్యాక్ ఏ గ్రేడ్, అటానమస్, కళాశాల గుర్తింపును రద్దు చేసి, న్యాక్ ఏ గ్రేడ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్, జోష్ణ ,ఉమేష్ చంద్ర,దిలీప్ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 03:17PM