నవతెలంగాణ నవీపేట్
మండలంలోని నందిగామ కార్యదర్శి ఎన్ఆర్ఈజీఎస్ నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని వార్డు సభ్యులు డిపిఓ జయసుధకు పలువురు శనివారం ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం అనుమతులు లేకుండా ఎన్ఆర్ఈజీఎస్ చెందిన 49,995 రూపాయలను తన వ్యక్తిగత ఖాతాలోకి జమ చేసుకొని దుర్వినియోగానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. వాటిని వెంటనే రికవరీ చేయాలని వార్డు సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాయినాథ్, గంగాధర్, సాయమ్మ, మోనమ్మ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 05:23PM