నవతెలంగాన కన్నాయిగూడెం
మండలంలోని బుట్టాయిగూడెం గిరిజన కాలనీలో ఉన్న ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ అధికారులు పట్టించుకోవడం లేదని ఆ కాలనీ మహిళలు తహశీల్దార్ కార్యలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అంగన్వాడీ సమస్యలపై తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ దానాలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. అలాగే గ్రామంలోని గిరిజన కాలనిలో ఉన్న అంగన్వాడీ కేంద్ర ఆయా పోస్ట్ ట్రైబల్ కి వస్తే దాన్ని నాన్ ట్రైబల్ గా మార్చి వేరే వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరం అని అన్నారు. గత 15 ఏండ్లుగా అంగన్వాడీ కేంద్రానికి కనీసం దారి లేదు అని.. పిల్లలు తాగడానికి నీరు లేదు. అని తెలిపారు. ప్రహరి గోడ లేదు అని.. పిల్లలు ఆడుకోవడానికి కనీసం గ్రౌండ్ లేదు అని.. ఒక చెట్టు,చేమా లేదని బాధిత మహిళలు వారి గోడును వెళ్లబుచ్చారు. తక్షణమే తమ అంగన్వాడీ కేంద్రం సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 06:21PM