-విద్యార్థితో అప్యాయంగా ముచ్చటించిన ఎస్ఐ తిరుపతి
-పెద్దలకంటే...చిన్నవారే ఉత్తములని పలువురి నెటిజన్ల అభిప్రాయం
నవతెలంగాణ-బెజ్జంకి
పోలిస్ శాఖలో ప్రభుత్వం చేసిన మార్పులు, ప్రెండ్లీ పోలిసింగ్ విధానంతో పోలిసు శాఖ ప్రజలకు మరింత చేరువవ్వగా.. అయితే గతంలో కంటే నేడు కొందరు ప్రజాప్రతినిధుల వ్యవహరణ వల్ల పోలీసులకు సరైన గౌరవం దక్కడంలేదని విమర్శలు వెల్లువేత్తున్న సమయంలో చట్టాధికారికి సముచితమైన గౌరవమిస్తూ బేగంపేట పాఠశాలలో దివ్యాంగ విద్యార్థి పోలిస్ అధికారికి సెల్యూట్ చేసిన అరుదైన చిత్రం సామాజిక మాద్యమంలో వైరల్ అవుతోంది. పెద్దలకంటే..పోలిసులను గౌరవించడంలో అభం శుభమేరుగని చిన్యారులే ఉత్తమమైనవారని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శనివారం మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకీషన్ పాల్గొన్నారు.విధుల్లో బాగంగా ఎమ్మెల్యేకు రక్షణగా వెళ్లిన ఎస్ఐ ఆవుల తిరుపతి పాఠశాలను సందర్శించగా దివ్యాంగ విద్యార్థి ఎస్ఐకి నమస్కారం సార్ అంటూ సెల్యూట్ చేయడం..సెల్యూట్ చేసిన విద్యార్థికి యథావిధిగా ఎస్ఐ నమస్తే అంటూ సెల్యూట్ చేయడం ప్రశంసనీయం. ఎస్ఐ ఆవుల తిరుపతి విద్యార్థిని అప్యాంగ పలకరించి కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థిని అభినందించి శ్రద్దతో చదివి మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:00PM