నవతెలంగాణ డిచ్ పల్లి.
బతుకు దేరువుకోసం గల్ఫ్ లోని కువైట్ దేశం కు వేళ్ళిన ఇందల్ వాయి మండలంలోని సంస్థన్ సిర్నపల్లి గ్రామానికి చెందిన బండి ప్రసాద్ ప్రసాద్ (40) గుండె పోటు రావడంతో శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ఇందల్ వాయి మండలంలోని గన్నరం గ్రామానికి చెందిన బండి ప్రసాద్ కు సంస్థన్ సిర్నపల్లి గ్రామానికి చెందిన బాలమణితో వివాహాం జరిగింది. అతను కొంతకాలం ఇల్లరికం వెళ్ళి సిర్నపల్లి లోనే ఉన్నాడు. అనంతరం బతుకు దేరువుకోసం గత కోన్నేండ్ల క్రితం దుబాయ్ వేళ్లాడు. అక్కడ పనులు చేస్తు ఇంకా రోడ్డు ప్రమాదంలో గాయ పాడి గతేడాది స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఇక్కడ ఉండి ఎలాంటి లాభం లేదని అనుకుని ఈ సారి గల్ఫ్ లోని కువైట్ దేశం కు ఉపాధ కోసం వెళ్లాడు. అక్కడ ప్రసాద్ కు గుండె పోటు రావడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య బాలామణి,ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుతురు , 9వ తరగతి చదువుతున్న కుమారుడు బాను ఉన్నారు.కుటుంబ సభ్యులకు విషయం తేలిసిన వేంటనే బోరున విలపించారు.మృతదేహనికి త్వరగా స్వగ్రామానికి తీసుకుని రావాలని సర్పంచ్ తెలు విజయ్ కుమార్, ఎంపిటిసి కచ్చకాయల అశ్విని శ్రీనివాస్,ఉప సర్పంచ్ నవిన్ గౌడ్ తోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు విన్నవించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:04PM