పోటి పరిక్షల శిక్షణ నిపుణులు వి చైతన్య దేవ్..
నవతెలంగాణ డిచ్ పల్లి.
చక్కని ప్రణాళిక వ్యుహత్మకత అధ్యయనం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిక్షల్లో అద్భుతమైన విజయాన్ని సాధించ వచ్చని పోటి పరిక్షల శిక్షణ నిపుణులు వి చైతన్య దేవ్ అన్నారు.తెలంగాణ యూనివర్సిటీ పోటీ పరీక్షల శిక్షణా విభాగం ఆధ్వర్యంలో శనివారం అన్ అకాడమీ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి చైతన్య దేవ్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. పబ్లిక్ సర్విస్ కమిష పరిక్షల్లో అభ్యర్థులు పాటించాల్సిన మెళకువల పై అవగాహన కల్పించారు. ఎంపిక చేసుకున్న అంశాలను నిరంతరం అధ్యయనం చేయాలని ఆయన సూచించారు లక్ష్యం పట్ల అంకితభావం ఎంతో అవసరమన్నారు. సిలబస్ కు సంబంధించిన రాజనీతి విభాగంలో ప్రతి అంశాలను తెలిపారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ఆరతి మాట్లాడుతూ పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్న శిక్షణ లో విద్యార్థులు పాల్గొని విజయాన్ని సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ జి బాల శ్రీనివాసమూర్తి ప్రసంగిస్తూ కార్యక్రమం ఉద్దేశాన్ని అభ్యర్థులకు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:38PM