నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ క్రికెట్ సంఘం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం స్థానిక నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో అండర్ 16..19 విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుండి అండర్ 16 విభాగం లో 163, అండర్ 19 విభాగం లో 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో బౌలింగ్ , బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన అండర్ 16, 19 విభాగాల్లో 52 మంది క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా టీసీఏ ఇన్చార్జ్ సయీద్ నయీం తెలిపారు. వీరు జులై నెలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన అన్నారు. ఈ ఎంపిక పోటీలకు ముఖ్యఅతిథిగా నవ్యభారతి గ్లోబల్ స్కూల్ చైర్మన్ క్యాతం సంతోష్ కుమార్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాకారులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పి సి ఏ సంఘంవారు గ్రాస్ రూట్ నుండి క్రీడాకారులను ఎంపిక చేయడం అభినందనీయం అని అన్నారు. ఇలాంటి ఎంపికలు క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుగా నిర్మించుకోని ఐపిఎల్, భారత జట్టుకు ఎంపికవడానికి లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అన్నారు. ఈ ఎంపిక ప్రక్రియ సయ్యద్, నయీమ్, కరీం, లాలా గౌరవ్ శర్మ, ఇలియాస్, సయ్యద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 08:19PM