Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి
నవతెలంగాణ-కల్చరర్రిపోర్టర్
గత 7నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా అవకాశాలు, బతుకు తెరువు లేక జానపద కళాకారులు ఆర్థిక తదితర ఎన్నో ఇబ్బందులు పడుతున్నవేళ ఆర్థిక సహాయం అందించి ఆదుకొన్న కొండలరావు ధన్యుడని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి అన్నారు. గత 3 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పేదకళాకారులను నగదు పురస్కారాలతో ఆదుకొంటున్న కొండలరావు దాతత్వం ఎనలేనిదని, ఈరోజు 50మంది పేద తెలంగాణ జానపద కళాకారులకు క్కొక్కరికి రెండువేల చొప్పున లక్షరూపాయలు ఆర్థిక సహాయమందించడం శ్లాఘనీయమన్నారు. సాంస్కతికబంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో యువకళావాహిని నిర్వహణలో శుక్రవారం రాత్రి రెడ్ హిల్స్ లోని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి క్యాంపు కార్యాలయంలో నిరుపేదలైన తెలంగాణ జానపద కళాకారులకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా డా. కె.వి. రమణాచారి, విశిష్ట అతిథిగా సీనియర్ పాత్రికేయుడు డా.మహ్మద్ రఫీ పాల్గొన్నారు. ముందుగా సభకు యువకళావాహిని లయన్ కై. కె. నాగేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం రమణాచారి కరోనా కష్టకాలంలో దాతలు ముందుకు వచ్చి అన్ని వర్గాలకు చెందిన పేద కళాకారులను అన్ని విధాలా ఆదుకోవాలని, దిక్కుతోచని దీనావస్థలోనున్న కళాకారులకు దారి చూపించి ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. చివరిగా డా. కె.వి.రమణాచారి రఫీ, వై.కె. తదితరులతో కలిసి పలువురు జానపద కళాకారులను ఘనంగా సత్కరించి నగదు పురస్కారాలను ప్రదానం చేశారు.