Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్
నవతెలంగాణ-నారాయణగూడ: రాష్ట్రంలోని ప్రైవేట్ సాంకేతిక కళాశాలల్లో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, అందులో భాగంగానే సంతోష్ నగర్, సైదాబాద్లోని సర్వే నెంబర్-246లో ఉన్నటువంటి బోజిరెడ్డి ఇంజ నీరింగ్ కళాశాల యాజమాన్యం ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అనుమతులు పొందుతున్నారని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్కుమార్ ఆరోపి ంచారు.శుక్రవారం నారాయణగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇలాంటి అవినీతి కళాశాలల్లో అధ్యాపకుల జీతాలు, వస తులు అరకొరగానే కల్పిస్తున్నారని మండిపడ్డారు. అఫిడవిట్లులో దాఖలు చేస్తారని, కానీ అవి ఎక్కడ అమలు చేయకపోవడం గమనార్హం అన్నారు. బోజిరెడ్డి కళాశాల యాజమాన్యం ప్రశ్నించిన ఉద్యోగులను అకారణంగా తొల గిస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు తాత్కాలిక జీతాలు అందజేస్తూ ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ఈ కళాశాల యాజమాన్యం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ విషయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఐఏఎస్ అధికారి సంతకాలను ఫోర్జరీ చేయడం కొసమెరుపు అన్నారు. ఒక ఐఏఎస్ అధికారి సంతకం ఫోర్జరీ చేయడం అంటే ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు.అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించాలని, మీయొక్క సంత కాలను ఫోర్జరీ చేసి మిమ్ములను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని వారికి సూచించారు. అధికారులు మేలుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి బోజిరెడ్డి కళాశాల యాజ మాన్యంపై తగిన చర్యలు తీసుకోవలని ఆయన డిమాండ్ చేశా రు.అదేవిధంగా ఆ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.