Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెంగాణ, జగద్గిరిగుట్ట
జీడిమెట్ల డివిజన్ పరిధిలో కఁత్బుల్లాపూర్ సర్కిల్ మైదానం సమీపంలో గల బహీన వర్గాల బస్తీలో బుద óవారం భారత్ వికాస్పరిషత్ (జాతీయ సంస్థ) అబ్దుల్ కలామ్ శాఖ, సర్దార్ పటేల్ శాఖ, సరోజినీ నాయుడు మహిళా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ బాలికా భద్రతా వారోత్సవాలను నిర్వహించారు.
ఈ కార్యక్ర మానికి భారత్ వికాస్పరిషత్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి పి.సురేంద్రకృష్ణ, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం శాఖ అధ్యక్షఁలు జానకిరామ్, సర్దార్పటేల్ శాఖ కార్యదర్శి మధుకఁమార్, సరోజినీ నాయుడు మహిళా శాఖ అధ్యక్షులు పద్మావతి, కార్యవర్గ సభ్యులు గాయత్రి, భవాని, సేవా భారతి పక్షాన శ్రీనివాస్ పాల్గొన్నారు.పేద మహిళలకు, బాలికలకు పండ్లు, పుస్తకాలు అందజేశారు. శివ విద్యానికేతన్ పక్షాన ఇద్దరు విద్యార్థులను దత్తత తీసుకుని మూడేళ్ళుగా విద్యను అందిస్తున్నట్లు రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రతి ఆదివారం పేద విద్యార్థు లకు ఉచితంగా తరగతులు నిర్వహిస్తామని గాయత్రి, పద్మావతిలు తెలిపారు. నరేంద్రకృష్ణ మాట్లాడుతూ బాలికా భద్రతా వారోత్సవాలలో భాగంగా గురువారం అయోధ్యనగర్లో ఉచిత వైద్యశిబిరం, వంటసామగ్రి పంపిణీ, తదితర కార్యక్రమాలు జరుగుతాయని, ఈ సేవలను ప్రతి ఒక్క నిరుపేద వినియోగించుకోవాలని తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు.