Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపరిరక్షణ సమితి నాయకులు
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడి ఆరేండ్లు పూర్తయినా దోపిడీదారుల ఆగడాలు ఏదో రూపంలో తెలంగాణలో కొనసాగుతూనే ఉన్నాయని తెలంగాణ భూ పరిరక్షణ సమితి నాయకులు ఎమ్వి. గుణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ మాఫియా పేదలకు సంబంధించిన భూములను కబ్జా చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు. ఇప్పుడు హఫీజ్ పేటలో కూడా సినిమా నిర్మాత సి.కళ్యాణ్ (చిల్లర కళ్యాణ్) పేదల భూమిని కబ్జాచేసి విల్లాలు కట్టి, ఖాళీ స్థలాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రౌడీలతో, గూండాలతో బాధితులను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. బాధితులకు అనుకూలంగా కోర్ట్ ఆర్డర్ ఉన్నా వాటిని ఉల్లంఘిస్తూ పైసా బలంతో, అధికార పార్టీ అండతో తమ ఆగడాలను కొనసాగిస్తూన్నారని, ఆ బాధితులకు అండగా తెలంగాణ భూపరిరక్షణ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి భూ పరిరక్షణ సమితి నాయకులు గాదె ఇన్నయ్య. సీనియర్ జర్నలిస్ట్ పాశంయాదగిరి, అడ్వకేట్ రవి, ప్రజాసంఘాలు, అఖిలపక్షం, విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని కోరారు.