Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలి పరిధిలో వివిధ డివిజన్లలో సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న 34 మంది ఉద్యోగులకు ఆఫీసర్లుగా (ఎఫ్ అండ్ ఏ) పదోన్నతి లభించింది. బుధవారం రోజున ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఫైనాన్స్ డైరెక్టర్ బి.వాసుదేవనాయుడు పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీజీఎమ్ (పి అండ్ ఎ) అబ్దుల్ ఖాదర్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ జహంగీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రెటరీ బి. జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.