Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ-సిటీబ్యూరో
అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్న ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐడీపీఎల్, నందనగర్ ఇంటి నెం.30-005/2 లో నివసిస్తున్న ఎండీ మొ యీన్, ఐడీపీఎల్ గాంధీóనగర్ ఇంటి నెం.27-39లో నివాసం ఉంటున్న బి. రాజేష్ అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. జలమండలి విజిలెన్స్ అధికారుల ప్రత్యేక తనిఖీల్లో ఈ విషయాన్ని గుర్తించారు. సంబంధిత యజమా నులపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే కూకట్పల్లిలోని పాపిరెడ్డినగర్లో నివా సం ఉంటున్న కె.నర్సింహులు అనే వ్యక్తి ఇంతకుముందే తొలగించిన నల్లా కనెక్షన్ను తిరిగి అక్రమంగా తీసుకు న్నాడు. గుర్తించిన విజిలెన్స్ అధికా రులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరిం చారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే జలమండలి విజిలెన్స్ బృందంకు 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.