Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత నిస్తుందని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం లాలాపేట్లోని జయశంకర్ స్టేడియాన్ని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోతే శోభన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జయశంకర్ స్టేడియం లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. మరమ్మతులు చేపట్టి వాకర్స్, స్థానికులకు, క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందిలేకుండలా చూస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ఎర్ర నాగు, పరశరామ్ తదితరులు పాల్గొన్నారు.